E-PAPER

వర్షాకాలంలో ఈ కూరగాయలతో జాగ్రత్త.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉండటంతో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీంతో ఆహార పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలు సులభంగా కలుషితమయ్యే అవకాశం ఉండటంతో వాటిని తీసుకునే ముందు శుభ్రతపై శ్రద్ధ వహించాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ కూరగాయలను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

పాలకూరతో పాటు ఇతర ఆకుకూరలు విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్నప్పటికీ వర్షాకాలంలో వీటిపై మట్టి, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కడిగినా కొన్ని హానికర సూక్ష్మజీవులు పూర్తిగా తొలగకపోవచ్చని, దీంతో కడుపు ఇన్‌ఫెక్షన్లు లేదా ఫుడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అందువల్ల వర్షాకాలంలో ఆకుకూరలను తప్పనిసరిగా శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తాజా, పరిశుభ్రమైన కూరగాయలను ఎంపిక చేసుకోవడం, బయట నిల్వ చేసిన లేదా పాడైపోయిన కూరగాయలకు దూరంగా ఉండటం ద్వారా సీజనల్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News