మణుగూరు తాసిల్దార్ అద్దంకి నరేష్
ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ప్రచార రథం ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మణుగూరు తాసిల్దార్ అద్దంకి నరేష్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల వ్యతిరేక ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. చట్టం కఠినం – శిక్ష తప్పదు ఈ సందర్భంగా తాసిల్దార్ నరేష్ మాట్లాడుతూ, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు, బాల్య వివాహం చేసినా, చేయించినా లేదా దానికి సహకరించినా అందరూ సమాన నేరస్తులేనని స్పష్టం చేశారు.
శిక్షా స్మృతి చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండు సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష మరియు ఒక లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శారీరక సమస్యలు తక్కువ వయసులో హార్మోన్ల అభివృద్ధి సరిగా జరగకపోవడం వల్ల గర్భధారణ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.రక్తహీనత చిన్న వయసులోనే తల్లులు కావడం వల్ల తీవ్రమైన రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉంది.అంగవైకల్యం సరైన శారీరక పరిపక్వత లేకపోవడం వల్ల పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో లేదా అనారోగ్యంతో పుట్టే అవకాశం ఉందని వివరించారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు”నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంది,” అని పేర్కొంటూ, ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహాలు చేయడం వారి ఎదుగుదలను దెబ్బతీయడమేనని అన్నారు. వివాహాల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరమై, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలని, వారి జీవితాలను అంధకారం చేయొద్దని కోరారు. ప్రచార రథాన్ని మణుగూరు మండలం అంతటా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తుందని ఎయిడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో
డిప్యూటీ తాసిల్దార్ రామారావు తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది ఎయిడ్ సంస్థ కమ్యూనిటీ సోషల్ మొబలైజర్లు జ్యోతి, మౌనిక మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.









