E-PAPER

పలాసలో ఘనంగా ప్రారంభమైన పెంట పోలమ్మ జాతర

పలాస, జూన్ 7 (వై 7 న్యూస్):

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులోని పొందల వీధిలో పెంట పోలమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.ఉదయం 4 గంటల నుంచి మేలుకొలుపు, మంగళస్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర మంగళవారం నాటికి ముగియనుంది.పగటి వేషాలతో వీధులు సందడి చెయ్యగా, భక్తుల రాకతో ప్రాంతం కిటకిటలాడింది.బర్తుల ఉత్సాహం, గ్రామీణ కళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.జాతర సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలి వచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News