ములుగు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈరోజు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. గురుస్వామి చిట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, కుమారస్వామి, నరేష్, మిథున్, మహేందర్, శ్రావణ్ గార్ల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మారుమోగింది. భక్తులకు ప్రసాద వితరణ కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ములుగు ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 6








