E-PAPER

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జుక్కల్ డిసెంబర్ 08 వై సెవెన్ న్యూస్ తెలుగు

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో గల కస్తూర్భా గాంధీ బాలికలవిద్యాలయాన్ని
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఎమ్మెల్యే పాఠశాలకు వెళ్లిన సమయంలో విద్యార్థినిలు కరాటే శిక్షణలో నిమగ్నమవగా ఆసక్తికగా తిలకించారు.
అనంతరం సిబ్బందిని అడిగి పాఠశాలలోని విద్యార్థుల చదవు మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు.వసతి గృహంలోని విద్యార్థులకు ప్రభుత్వం డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్