E-PAPER

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. బుధవారం ట్రేడింగ్‌లో బ్రెంట్, డబ్ల్యూతీఐ (WTI) క్రూడ్ ధరలు దాదాపు 3 శాతం వరకు ఎగిశాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం నిర్వహించిన వైమానిక దాడులు, హోర్ముజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతలు చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తాజా ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల మార్కును దాటి 76.09 డాలర్ల వద్ద ట్రేడైంది. మరోవైపు అమెరికా డబ్ల్యూతీఐ క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 72.37 డాలర్లకు చేరుకుంది. జూలై 6తో పోలిస్తే బ్రెంట్, డబ్ల్యూతీఐ ధరలు గణనీయంగా పెరగడం గ్లోబల్ ఇంధన మార్కెట్‌లో ఆందోళన కలిగిస్తోంది.

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన డ్రోన్ దాడులకు ఇరానే కారణమని అమెరికా, ఖతార్ ఆరోపించాయి. ఈ ఘటనల అనంతరం ఇరాన్ చమురు అమ్మకాలకు సంబంధించిన సాధారణ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో మార్కెట్‌లో అనిశ్చితి పెరిగింది. ఖతార్‌కు చెందిన ‘అల్ రెకాయత్’ ట్యాంకర్‌తో పాటు సౌదీ జెండా కలిగిన ‘వెడయాన్’ సూపర్‌ట్యాంకర్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో ముడి చమురు ధరలు మరింత ఎగసిపడుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News