వై 7 న్యూస్ పలాస:
ఇచ్చాపురంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ మృతి చెందాడు. బైక్పై వస్తున్న కుమార్ ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్తో ఢీ కొన్న సందర్భంగా బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. తలకి బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. సంఘటన సమాచారం తెలుసుకున్న ఇచ్చాపురం ఎస్ఐ ముకుందరావు ఘటన స్థలానికి చేరుకొని దేహాన్ని ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Post Views: 28









