E-PAPER

పుస్తకాలతో విద్యాభివృద్ధికి బాట

అన్నపురెడ్డిపల్లి, జూలై 29 (వై 7 న్యూస్ ప్రతినిధి);

అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఎర్రగుంట గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) నందు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జాతీయ నయీ తాలిం సమితి జాతీయ అధ్యక్షురాలు పి. ఉషారాణి ప్రారంభించారు.

ఈ గ్రంథాలయ ఏర్పాటుకు ప్రవాస భారతీయ వాసవీ సంఘం (NIRVA) మరియు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ నుంచి రూ. 37,968 విలువగల పుస్తకాలు విరాళంగా అందాయి. విద్యార్థుల చదువుకు అవసరమైన వివిధ శాస్త్రీయ, సాహిత్య, సామాజిక అంశాలపై ఆధారిత గ్రంథాలను అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యు. ఆనందకుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు శాంతకుమారి, రాజ్యలక్ష్మి, పద్మ సుశీల, మోతీలాల్, జయరాం, మీరా హుస్సెయిన్, శ్రీనివాసరావు, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, సీఆర్పీలు శిరీష, నాగమణి, సీసీఓ రమణ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News