E-PAPER

మృతురాలి కుటుంబానికి బియ్యం అందించిన కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం, జూలై 20 వై 7 న్యూస్ తెలుగు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం ఎస్.సి కాలనీలో నివసిస్తున్న నైనారపు పెద్దలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి దశదిన కర్మలు జరుపుకోవాల్సిన సమయంలో ఆ కుటుంబం ఆర్థికంగా కాస్త ఇబ్బంది పడుతుండగా, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందించారు.

పేదవారి బాధను తనవిగా భావించి, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఇక్బాల్ హుస్సేన్ ను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, కార్యకర్తలు, పెద్దలు, మరికొంతమంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇలాంటి మానవీయ సేవా కార్యక్రమాలు సమాజంలో పరస్పర సహాయ సహకారాలను పెంపొందించడమే కాక, రాజకీయ నాయకుల్లో ఉన్న మానవతా విలువలను కూడా ప్రతిబింబిస్తాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News