మణుగూరు; మే 06, వై 7 న్యూస్
విజిటర్స్ గది… మర్యాదల కోణం కాదు, నిర్లక్ష్యాన్ని చాటే కోణం!
మణుగూరు సింగరేణి అధికారులను కలిసే ప్రజల కోసం ఏర్పాటు చేసిన గది శ్రామికుల గౌరవానికి తగినట్లుగా లేదు.సింగరేణి ప్రాంతం శ్రమదానం చేసిన కార్మికుల విశ్రాంతి స్థలం మాత్రమే కాదు, ప్రజల అండగా నిలిచే అధికారుల గడప కూడా. రోజూ ప్రజల నిత్యజీవిత సమస్యలతో అధికారులను కలిసేందుకు వచ్చిన వారు తొలిగా ఎదురయ్యే దృశ్యం – “విజిటర్స్ రూమ్”. కానీ ఆ గది దుస్థితి చూస్తే, అదే అధికారుల పనితనానికి నిదర్శనమని అనిపించకమానదు.
ఇరిగిపోయిన కుర్చీలు – ఓల్డ్ ఫర్నిచర్,
విజిటర్స్ రూమ్లో ఉన్న స్టీల్ కుర్చీలు ఉపయోగించడానికి దాదాపు అర్హత కోల్పోయిన పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని కుర్చీలు ఒరిగిపోయి, మరికొన్ని ఎగతాళి చేసేలా వంగిపోయి ఉన్నాయి. ఇది ప్రజలకు అసౌకర్యమే కాకుండా, పరిపాలనపై అవమానాన్ని కలిగించే అంశం.
వాటర్ ప్రిజ్… పేరుకే ఉన్నది కానీ పని చేసే శక్తి లేదంట!
గదిలో ఉంచిన వాటర్ ప్రిజ్ పనిచేయని పరిస్థితిలో ఉంది. వేసవిలో అధికారులు ఏసీ గదుల్లో ఉంటే, వేచి చూస్తున్న ప్రజలకు ఒక్క చల్లటి నీటికి అవకాశం లేకపోవడం నిజంగా దురదృష్టకరం.
శుభ్రత పేరు చెప్పకూడదు
గదిలో గోడలు పాతరంగుతో ఉన్నవి, మరమత్తులు జరగని ధ్వంసిత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాస్టిక్ కవర్లు, చెత్త స్ధలాల్లో పడిపోవడం చూస్తే, ఇది ప్రజల గౌరవాన్ని తక్కువగా చూడటం కాదా?
ఇది కేవలం గది కాదు – ప్రజాభిప్రాయానికి ప్రతిబింబం
ఒక సంస్థ ప్రజలను ఎలా గౌరవిస్తోంది అనే దానికి, “విజిటర్స్ రూమ్” పరిస్థితి ఒక కొలమానం. మణుగూరు సింగరేణి విజిటర్స్ గది ప్రస్తుత రూపం, అక్కడి అధికారుల దృష్టికోణాన్ని నిశ్శబ్దంగా వెల్లడిస్తోంది.
అధికారులకు విజ్ఞప్తి – గౌరవంగా గది మార్పు చేయండి
ఈ గదిని ఆధునికీకరించాల్సిన అవసరం తీవ్రంగా ఉంది. కనీస సౌకర్యాలు కల్పించి, ప్రజల గౌరవానికి తగిన వాతావరణాన్ని అందించాలి. ఇది కేవలం మరమ్మత్తు కాదు – ప్రజలపై నమ్మకాన్ని నిలబెట్టే మార్గం.









