E-PAPER

జైలు నుండి విడుదల అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో అరెస్టయి, ఆరునెలల అనంతరం శుక్రవారం బెయిల్ పై జైలు నుండి విడుదల అయిన సంగతి తెలిసిందే.
కేజ్రీవాల్ జైలు నుండి బయటికి వస్తున్న సందర్భంగా ఆప్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చారు. వారిని ఉద్దేశించి కేజ్రీవాల్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.నన్ను జైల్లో పెడితే మనోబాలాన్ని కోల్పోతానని బీజేపీ నాయకులు భ్రమ పడ్డారు. 100 రెట్ల శక్తితో తిరిగి వచ్చానన్నారు.

ఇపుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేరని,నావైపు న్యాయం ఉందని, ప్రజలు కూడా నావైపే ఉన్నారన్నారు. ఈ ఆటలో నేనే గెలుస్తానన్నారు. దేశం కోసం, ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తానని తెలిపారు ఈ క్రమంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోడానికైనా సిద్దంగా ఉంటానన్నారు. ఇంత జోరు వానలో కూడా నాకోసం వచ్చిన మీ అందరి ప్రేమకు నా ధన్యవాదాలు అంటూ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్