E-PAPER

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తత.. నిరసనకారులపై కాల్పుల ఆరోపణలు

 

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రావల్‌కోట్‌లో జరిగిన నిరసనల సందర్భంగా భద్రతా బలగాల కాల్పుల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడినట్లు స్థానిక వర్గాలు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. జూలై 5న ప్రకటించిన బంద్‌కు ముందు నుంచే నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పేర్కొంది. అయితే ఈ ఘటనలపై పాకిస్తాన్ అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

JAAC ఆరోపణల ప్రకారం, నిరసనల అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలపై పరిమితులు విధించడంతో పాటు ప్రధాన రహదారులను మూసివేసింది. ప్రజల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారని, అంతర్జాతీయ సమాజం ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యపడలేదు.

విద్యుత్ చార్జీల పెంపు, గోధుమ కొరత, సబ్సిడీల తగ్గింపుకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా రాజకీయ ఉద్యమంగా మారాయి. ఇదిలా ఉండగా, జూన్ 5న JAACను పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటించింది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్‌లో నివసిస్తున్న శరణార్థులకు కేటాయించిన 12 రిజర్వ్ స్థానాలను రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News