E-PAPER

విద్యార్థుల ప్రతిభకు వేదికగా రోబో మైండ్స్ స్కూల్ వార్షికోత్సవం

హైదరాబాద్: నగరంలోని రోబో మైండ్స్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం శ్రీ భవానీ శంకర్ నగర్, వాసవి కళ్యాణం గ్రౌండ్‌లో ప్రారంభమైంది.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ , కినారా వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు నాగచంద్రిక , డీసీసీబీ మెదక్ డైరెక్టర్ పట్లొల్ల రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థులు నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. పాఠశాల నిర్వహణ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ అలేఖ్య రాయల నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, స్థానికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News