పలాస కాశీబుగ్గ పట్టణ పరిధిలో ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పలాస సీఐ రామకృష్ణ తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రజాశాంతి మరియు భద్రత పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.ఈ సందర్భంగా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Post Views: 28








