భద్రాద్రి: భద్రాద్రి జిల్లాలో A/C టెక్నీషియన్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా గేడ్డాపు నాగేంద్రప్రసాద్ను ఎన్నుకోగా, ముఖ్య సలహాదారులుగా S.K. రఫీను నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా నవీన్, శ్రీకర్, మహేష్, హరీష్, శ్రీధర్, మహేష్ చారి, గోపాల్, నరసింహ, రాజశేఖర్, రవికిరణ్, ఖదర్, ఏడుకొండలు తదితరులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ సమావేశంలో టెక్నీషియన్ల భద్రత, వృత్తి విలువలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పని రేట్ల ప్రణాళిక, యూనియన్ కార్డులు, లేబర్ లైసెన్సులు వంటి కీలక అంశాలపై చర్చించారు.
యూనియన్ బలోపేతానికి సభ్యులందరూ ఐక్యంగా పనిచేయాలని, టెక్నీషియన్ల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.
Post Views: 90








