. న్యాయమే గెలిచింది
. సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చి న్యాయం పక్షాన నిలిచింది*
MLC కవిత బెయిల్ పై హర్షిస్తూ ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణ భవన్ నందు MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కి బెయిల్ మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. బాణాసంచా కాల్చి మిఠాయిని పంచిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆర్.జె.సి కృష్ణ, మైనారిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, ఉద్యమకారులు – పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, ఆసిఫ్, టెంకటి సందీప్, మరియు సద్దాం, మాటేటి కిరణ్, సతీష్, మంచా నాయక్ మరియు ఇతర కార్యకర్తలు సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు న్యాయం గెలిచింది.. సుప్రీంకోర్టు ముందు నిలువని అబద్దాల ప్రచారాలు.. జై బిఆర్ఎస్.. జై కేసీఆర్.. అంటూ నినాదాలు చేశారు.









