ములుగు, ఆగస్టు 27 వై7 న్యూస్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటన లో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లా కు చేరుకున్నారు. గవర్నర్ తోలుత యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్ మార్గంలో ములుగు జిల్లా కు అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నరు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.సంప్రదాయ నృత్య రితులతో గవర్నర్ కు స్వాగతం పలికారు.
Post Views: 86









