E-PAPER

లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ముధోల్ ఆగస్టు12(వై7 న్యూస్)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ.. అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యరీత్యా ఆదుకుంటుందని అన్నారు.అనంతరం క్యాంప్ ఆఫీస్ నందు మండల సంభందిచిన అన్ని శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు కలిసి ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలని, విద్య , వైద్యం ఇరిగేషన్,
డ్రైనేజీ, సాగునీరు,తాగునీరు సమస్యలను పరిష్కరించాలని, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని, చెరువులను కాపాడుతూ, ఆధునీకరించాలని, వివిధ సమస్యలపై సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News