E-PAPER

భారీగా బంగారు నగలు స్వాధీనం – ఒకరి అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం: ఇటీవల ఇచ్చాపురం పట్టణంలో వరుసగా చోటుచేసుకున్న ఇంటి చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు మరియు ఇతర చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రికవరీ చేసిన సొత్తును ప్రదర్శించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో పలు రకాల బంగారు గొలుసులు, నెక్లెస్‌లు, ఉంగరాలు మరియు రొక్కం నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల నమోదైన వరుస దొంగతనాల ఫిర్యాదులపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాలను అంగీకరించడంతో అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో బంగారు ఆభరణాలు, నగదు వంటి విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పొరుగువారితో పరస్పర సమాచారం పంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు.

వరుస దొంగతనాల కేసును ఛేదించి చోరీ సొత్తును బాధితులకు తిరిగి అందించే దిశగా చర్యలు చేపట్టిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!