పినపాక, జూన్ 13 వై 7 న్యూస్;
విశ్వసనీయ సమాచారం మేరకు టి.కొత్తగూడెంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంపై డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశాలతో, సీఐ వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం దాడి చేసింది.ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, ₹5,100 నగదు, ఐదు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో మరొక నలుగురు వ్యక్తులు పరారయ్యారు. మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయగా, పరారీలో ఉన్నవారికోసం గాలింపు కొనసాగుతోందనీ ఎస్ ఐ రాజ్ కుమార్ తెలిపారు..
Post Views: 390









