E-PAPER

నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం;గద్ధల రామకృష్ణ

అశ్వాపురం,ఆగస్టు03(వై 7 న్యూస్ );భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాడ్లడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసంపూర్తిగా ఉన్నదని, ఏ డిపార్ట్ మెంట్ నుండి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారనేది క్లారిటీ లేకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వంమోసం చేస్తుందని, జాబ్ క్యాలెండరు పై పూర్తి క్లారిటీ ఇవ్వాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు నజీర్ షోను, రసాల రమేష్, పిట్టా శ్రీను, బాగావత్ సతీష్, మామిడాల శివ, కొమ్ము రాంబాబు, గద్దల శ్రీను, పిట్ట సతీష్, ప్రేమ్ కుమార్, సాయి, నాండ్రు సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News