E-PAPER

మొబైల్ కోర్టుల పునరుద్ధరణకు మంత్రికి వినతి

భద్రాచలం ;
భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి జి.ఓ. ఎం.ఎస్. నెం.70ను రద్దు చేసి భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మొబైల్ కోర్టు వ్యవస్థను పునరుద్ధరించాలని వినతిపత్రం సమర్పించారు. గతంలో జి.ఓ. ఎం.ఎస్. నెం.406 ద్వారా అమలైన మొబైల్ కోర్టుల వల్ల గిరిజన ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం అందిందని, ప్రస్తుతం ఆ వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మొబైల్ కోర్టులను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News