మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ లో ఇండిపెండెంట్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్న అలెం స్వరూప ఈరోజు ఉదయం తన ఓటు హక్కును వినియోగించారు.సమితి సింగారం లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిస్సంకోచంగా, స్వచ్ఛంగా ఓటు హక్కును వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. తన భర్త, తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలెం కోటి తో పోలింగ్ బూత్కు చేరుకున్న అలెం స్వరూప, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు.
Post Views: 44









