E-PAPER

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన గోపాల్పేట్ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి

వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలోని ఓ అవినీతి చేప ఏసిపి అధికారులకు చిక్కిన ఘటన మంగళవారం 2 గంటలకు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం మండల కేంద్రంలో విద్యుత్ అసిస్టెంట్గా ఇంజనీరింగ్ ఎన్ హర్షవర్ధన్ రెడ్డి ఏదుల మండల కేంద్రానికి చెందిన ఓ రైతు దగ్గర ట్రాన్స్ఫారం మంజూరు కోసం 40 వేల రూపాయలు డిమాండ్ చేస్తూ 20వేల రూపాయలు ముందు ఇవ్వాలి. తర్వాత ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత మరో 20 వేలు ఇవ్వాలి అని ఒప్పందంలో భాగంగా మంగళవారం 2 గంటలకు 20 రూపాయలు రైతు నుండి డబ్బులు తీసుకుంటుండగా మహబూబ్నగర్ ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.అతనిని రేపు నాంపల్లి కోర్టులో హాజరు పరచున్నట్లు మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పిసిహెచ్ బాలకృష్ణ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News