E-PAPER

మణుగూరు ఏరియా ఓసి -2 ఆపరేటర్ల ఔదార్యం

అనారోగ్యంతో మృతి చెందిన సింగరేణి కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మణుగూరు,డిసెంబర్15 వై 7 న్యూస్ తెలుగు;

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి-2 ఏ రిలే ఆపరేటర్ల ఆధ్వర్యంలో తమ షిఫ్ట్ లోనే పంపు ఆపరేటర్ గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పీ వి కాలనీ వాసి రుద్రాక్షల కృష్ణ కుటుంబానికి ఆదివారం నాడు పీవీ కాలనీలో వారి నివాస గృహానికి చేరుకుని ఏ రిలే షిఫ్ట్ ఇన్ చార్జ్ ఎం నరసింహారావు చేతుల మీదుగా డబ్బయి మూడు వేల ఐదువందల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి మాట్లాడుతూ ఆపదలో ఉన్న తమ తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా ఆపన్న హస్తం అందజేసి మేమున్నామంటూ కొండంత మనోధైర్యాన్ని నింపటం ఓదార్పునివ్వడం అభినందనీయమని ఈ సందర్భంగా ఆపరేటర్ల సేవలను ఆయన కొనియాడారు. తమ తోటి ఉద్యోగులే కాకుండా కష్టాల్లో ఉన్న అనేకమందికి అనేక విధాలుగా పలు సందర్భాలలో తోడ్పాటునందించిన ఏ రిలే ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. అందరితో ఎంతో స్నేహభావంగా ఉండే కృష్ణ మృతి ఎంతో బాధాకరమని సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అండర్ మేనేజర్ భార్గవ్,ఇంజనీర్ వెంకటరమణ హెడ్ ఓవర్ మెన్ లు సుదీప్, రాజ్ కుమార్, ఏ రిలే ఆపరేటర్ల తరపున ప్రతినిధులుగా సయ్యద్ నయమత్ హుస్సేన్, కె మల్లికార్జునరావు, భాగం రవికుమార్, గిరీష్ రెడ్డి, శ్రీధర్, చెన్నుపాటి హనుమాన్ బాబు,కొత్త సత్యనారాయణ, ఎండి యాకూబ్ పాషా, అన్నం రాజేందర్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News