అశ్వాపురం,సెప్టెంబర్02 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15 వర్ధంతి అశ్వాపురం మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించి నివాళులర్పించిన అశ్వాపురం మండల నాయకులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండల్లో 2003 ఏప్రిల్ 9న ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభించి మండుటెండల్లో 1,475 కిలోమీటర్లు నడిచారని పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఇటు ఉమ్మడి రాష్ట్రాలలో అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చారని 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, ఫైలుపై తొలి సంతకం,1,100 వంద కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశావని దాదాపు 35 లక్షలకు పైగా పంపు చెట్లకు ఉచిత విద్యుత్ అందించారని తెలియజేశారు ఎంతోమంది పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందించిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఒక అరుదైన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్లు మూడు నెలలు కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారని భౌతిక దూరమైన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలియజేసి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన అశ్వాపురం మండల నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి,ఓరుగంటి రమేష్ బాబు, మాజీ ఎంపిటిసి బేతం రామకృష్ణ, ఎక్కటి సత్యనారాయణ రెడ్డి, మాదినేని రాంబాబు, తూము రాఘవులు, బచ్చు వెంకటరమణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు