E-PAPER

ఎమ్మెల్యే కి వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సంఘం

నిర్మల్ జిల్లా Y7 న్యూస్
27-07-2024

భైంసా పట్టణంలో ఆదివారం డబల్ బెడ్ రుమ్ లబ్ధిదారుల సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దగ్గరికి వెళ్లారు. నిరుపేదలకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పటివరకు అంటే దాదాపుగా ఒక సంవత్సరం పూర్తయినా కానీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పగించలేదని,ఈ ఇండ్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, నీటి వసతి సదుపాయంగాని ఇంకా పూర్తి కాలేదని,కావున వీటిని తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు తొందరగా వ అప్పగించాలని కోరుతూ ఆదివారం రోజున 28/7/2024 వినతి పత్రం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు శిలారం సత్యనారాయణ, జగజంపుల రాజు, భాస్కర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News