మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఆ రాష్ట్రంలోని అత్యంత సంపన్న ఎమ్మెల్యేలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.3,300 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల ముంబయి వీధుల్లో ఆయన సాధారణ భిక్షగాడి వేషంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
అంతటి సంపన్నుడైన ఎమ్మెల్యే ఇలా భిక్షగాడి వేషంలో ఎందుకు కనిపించారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. కొందరు ఆయన ఆర్థిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేయగా.. మరికొందరు ఇది ఏదైనా రాజకీయ కార్యక్రమంలో భాగమా అని ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడంతో పరాగ్ షా ఇలా కనిపించడానికి అసలు కారణమేంటనే ఆసక్తి పెరిగింది.
అయితే పరాగ్ షా నిజంగానే భిక్షాటన చేయడానికి వీధుల్లోకి రాలేదు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సామాన్యుడి జీవన విధానాన్ని అనుభవించేందుకు ఆయన భిక్షగాడి వేషం ధరించినట్లు తెలుస్తోంది. అసలు ఈ కార్యక్రమం ఏంటి? ఎమ్మెల్యే ఇలా వేషం మార్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న పూర్తి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.








