మణుగూరు;
“శ్రీ పరాభవ నామ సంవత్సరం” ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని సమితి సింగారం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయనను తమ అభిమాన నాయకుడిగా, రాజకీయ గురువుగా పేర్కొంటూ గాండ్ల సురేష్ అభినందనలు తెలిపారు.
ఉగాది పర్వదినం రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, అభివృద్ధి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Post Views: 21








