శ్రీరాంపూర్: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ESI అమల్లో ఉన్న వేతన సీలింగ్ను వెంటనే ఎత్తివేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (SCKS) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఓ.సి విభాగంలో నిర్వహించిన కన్వేయన్స్ డ్రైవర్ల గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
₹21 వేల సీలింగ్ కారణంగా వేలాది మంది కార్మికులు ESI నుంచి బయటకు
కార్మికుల వేతనం ₹21 వేలు దాటితే ESI అనర్హతగా మారేలా BJP మోడీ ప్రభుత్వం సీలింగ్ను విధించిందని శ్రీనివాస్ తెలిపారు.
సెక్యూరిటీ, కన్వేయన్స్ డ్రైవర్లు, సూపర్వైజర్ల వంటి స్కిల్డ్ కార్మికులు ఈ సీలింగ్ కారణంగా వైద్య సదుపాయం కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బోనస్ను వేతనంలో కలపడం వల్ల సీలింగ్ కృత్రిమంగా పెరుగుతోంది
ఎటువంటి కారణం లేకుండా సంవత్సర బోనస్ను నెలవారీ వేతనంలో కలిపి చూపడంతో వేతనం 21 వేల దాటినట్లు చూపుతున్నారని ఆయన విమర్శించారు.దీంతో కార్మికులకు సింగరేణి హాస్పిటల్లో వైద్యం దొరకకుండా, ESI కూడా అమలు కాకుండా పరిస్థితి
ఏర్పడుతోందన్నారు.
10 సంవత్సరాలుగా సీలింగ్ సవరణలేదు
2017లో కేంద్రం నిర్ణయించిన వేతన సీలింగ్ను ధరల పెరుగుదల దృష్ట్యా కనీసం ఒకసారి కూడా సవరించలేదని శ్రీనివాస్ అన్నారు.
దీని కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ESI హక్కు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
“యాజమాన్యాల లాభాలకు సీలింగ్ లేదు… కార్మిక సంక్షేమానికే ఎందుకు?”
ESI, PF, బోనస్లపై ఉన్న సీలింగ్లు కార్మికులపై అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలకు మేలు చేసేలా వ్యవహరిస్తుండగా, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
SCKS డిమాండ్లు
ESI వేతన సీలింగ్ ₹21 వేలను తక్షణమే ఎత్తివేయాలి
ESI, PF, బోనస్లపై ఉన్న సీలింగ్లను సవరించాలి లేదా పూర్తిగా తొలగించాలి
కన్వేయన్స్ డ్రైవర్లకు ESI అమలు చేయడం సింగరేణి యాజమాన్యం బాధ్యతగా ప్రకటించాలి
ఈ సమావేశంలో SCKS శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి గట్టు మహేందర్, కన్వేయన్స్ డ్రైవర్ యూనియన్ నాయకులు కాసీపేట రాజేశం, సంపత్ రావు, కలవేని సతీశ్, రాజాలింగు, విద్యాసాగర్, రాఘవేంద్ర, సురేష్, వినేయ్, శ్రీనివాస్, శ్రీధర్, ప్రదీప్, కుమార్, ఖాజా, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.









