వై7 న్యూస్
రేపటి నుంచి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోన్న కేంద్రం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మే 7న మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. 50 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ డ్రిల్స్ పౌరులకు సంక్షోభ సమయంలో రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తాయి. కార్గిల్ యుద్ధంలో సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమైన డ్రిల్స్, ఈసారి దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, బ్లాకౌట్, తరలింపు ప్రణాళికలు పరీక్షించబడతాయి.
Post Views: 93









