E-PAPER

సారపాక ఐటీసీ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కార్మికుడు మృతి

బూర్గంపాడు, ఆగస్టు 7 (వై7 న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ ప్రధాన గేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వచ్చిన లారీ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధువన్ అనే వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం. మృతుడు ఐటీసీ కర్మాగారంలో అంబిక ఫ్యాబ్రిక్‌కు చెందిన మురళి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికుడిగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదాలకు అడ్డాగా మారుతున్న సారపాక జాతీయ రహదారి

స్థానికుల కథనం ప్రకారం, సారపాక హెచ్‌పీ గ్యాస్ సమీపం నుంచి బీపీఎల్ స్కూల్, శ్రీరాంపురం గ్రామం వరకు ఉన్న జాతీయ రహదారి ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీసీ కర్మాగారానికి విధులకు వెళ్లే, తిరిగి వచ్చే సమయాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో వేగ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు, ఐటీసీ యాజమాన్యం, ట్రాఫిక్ విభాగం సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గమనిక: ప్రమాదాల కారణాలు, బాధ్యతలపై అధికారిక విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు సంబంధిత ఆరోపణలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!