E-PAPER

BREAKING NEWS : చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సర్పంచ్ మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | భద్రాచలం

పాల్వంచ మండలం దంతెలబోరు గ్రామ సర్పంచ్ సోడి వెంకటరమణ బుధవారం కాలుకు ఇన్ఫెక్షన్ కారణంగా భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో రెండు రోజులు గడవకముందే ఆమె మృతి చెందారు.

సర్పంచ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, మృతికి గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

గమనిక: మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే అధికారికంగా నిర్ధారణ కానున్నాయి. ప్రస్తుతం బంధువుల ఆరోపణలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News