E-PAPER

‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ఐసీయూలో చికిత్స, అభిమానుల్లో ఆందోళన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ద్వారా గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండగా, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ కామెడీ సన్నివేశాల్లో నటించిన రమేష్ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయనకు ‘గబ్బర్ సింగ్ రమేష్’ అనే ప్రత్యేక గుర్తింపు లభించింది. అనంతరం పలు తెలుగు చిత్రాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

రమేష్ అనారోగ్య వార్తతో టాలీవుడ్ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తుండగా, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News