E-PAPER

డిజిటల్ యుగంలో పెరుగుతున్న ముప్పులు ; సూర్యాపేట ఎస్పీ నరసింహ

అప్రమత్తతే పౌరుల నిజమైన ఆయుధం

డిజిటల్ సాంకేతికత… వరమా? శాపమా?

సూర్యాపేట

సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ డిజిటల్ యుగంలో పౌరులు ఎదుర్కొంటున్న పెను ప్రమాదాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కనిపించని నకిలీ లింకులు, పెట్టుబడి మోసాలు, వర్చువల్ వ్యసనాలు ప్రజలను ఆర్థికంగా – మానసికంగా బలహీనపరుస్తున్నాయని హెచ్చరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ చిన్న మొత్తాలతో మొదలై ప్రాణాలు తీస్తోంది

బెట్టింగ్ వ్యసనం రోజురోజుకీ పెరుగుతోందని, చిన్న మొత్తాలతో మొదలు పెట్టి చివరకు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు దారితీస్తున్న ఘటనలు అధికమవుతున్నాయని ఎస్పీ స్పష్టం చేశారు.“బెట్టింగ్ డబ్బు సంపాదించే మార్గం కాదు… నాశనానికి దారితీసే లెవెల్” అని ఆయన స్పష్టం చేశారు.

డీప్‌ఫేక్‌లు రొమాన్స్ స్కాములు: డిజిటల్ లోకంలో కొత్త భూతాలు

సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి డీప్‌ఫేక్ వీడియోలుగా తయారు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.
హాయ్.. హలో అంటూ మొదలయ్యే ఆన్‌లైన్ స్నేహాలు రోమాంటిక్ మోసాలకు దారితీస్తున్నాయని, ముఖ్యంగా మహిళలు, యువత మానసికంగా దెబ్బతింటున్నారని తెలిపారు.

మీ ఆధార్ నేరంలో వాడాం…” డిజిటల్ అరెస్ట్ మోసాలు పెరుగుదల

అనుమానస్పద కాల్స్ ద్వారా వ్యక్తుల గుర్తింపును నేరంలో వాడామంటూ బెదిరించి, డబ్బులు దోచుకునే డిజిటల్ అరెస్ట్ గ్యాంగులు ఉధృతమవుతున్నాయని ఎస్పీ వివరించారు.
యాప్ లోన్లు, మైక్రో ఫైనాన్స్ యాప్‌లు వడ్డీపై వడ్డీ వేసి అమాయకులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు.

పిల్లలపై డిజిటల్ వ్యసనం ప్రభావం… ఆరోగ్యానికి ప్రమాద ఘంటిక

పిల్లలను లక్ష్యంగా చేసుకుని ప్రమాదకర గేమ్‌లు, గిఫ్ట్ పేరుతో డేటా దోపిడీ.
జరుగుతోందన్నారు.రాత్రిళ్లు ఫోన్ వినియోగం పెరగడం వల్ల:

నిద్రలేమి

ఏకాగ్రత లోపం

కోపం

ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు.

“టెక్నాలజీ పదునైన రెండు ధారాల ఆయుధం” ఎస్పీ నరసింహ

డిజిటల్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తామన్నదే భవిష్యత్తు నిర్ణయిస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.
“అప్రమత్తత అవగాహన జాగ్రత్త… ఇవే డిజిటల్ యుగంలో పౌరుల అస్త్రాలు” అని చెప్పారు.

జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు యువతకు కీలక సూచనలు

. అనుమానాస్పద లింకులు, కాల్స్, మెసేజ్లు ఓపెన్ చేయవద్దు.
. ఆన్‌లైన్ బెట్టింగ్‌, ప్రమాదకర గేమ్‌లు పూర్తిగా దూరం పెట్టండి.
. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ తప్పనిసరి.
. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు.
. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను పబ్లిక్‌లో ఉంచవద్దు.
. పెట్టుబడులు, ఉద్యోగాలు ధృవీకరించిన వనరుల ద్వారా మాత్రమే చేయండి.
. ఆన్‌లైన్‌లో డబ్బు అడిగితే ముందుగా వ్యక్తిని సంప్రదించి ధృవీకరించండి.
. అనుమానాస్పద ప్యాకేజీలు స్వీకరించవద్దు.
. ఏ మోసం జరిగిన వెంటనే 1930 సైబర్ సహాయక కేంద్రంకు ఫిర్యాదు చేయాలి అని తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News