తూప్రాన్ నవంబర్18( వై 7 న్యూస్)
తూప్రాన్ మండల ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ శివానంద మాట్లాడుతూ, ఇటీవల ఖరీఫ్ సీజన్ వరి కొయ్యడానికి హార్వెస్టర్ ని ఉపయోగించడం జరుగుతుందని ,ఇట్టి హార్వెస్టర్ వాహనదారులు వరి కటింగ్ బ్లేడు ని వెనక ట్రాలీకి తగిలించుకోకుండా ఇంజన్ కి ఫిట్ చేసి రోడ్డుమీద అత్యంత ప్రమాదకరంగా మరియు నిర్లక్ష్యంగా వాహనాలని నడిపించడం ద్వారా ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సోమవారం ఒక హార్వెస్టర్ ని పట్టుకుని దానిమీద ఎం వి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసామని తెలియజేశారు. కావున హార్వెస్టర్ వాహనదారులు దూర ప్రాంతాలకు వెళ్లిన యెడల వరి కటింగ్ బ్లేడును మిషన్ ని వెనక ట్రాలీకి తగిలించుకొని ప్రయాణం చేయగలరని మరియు ప్రజలు ఇట్టి హార్వెస్టర్ వాహనానికి కొద్ది దూరంలో పయనించగలరని సూచించారు.
Post Views: 591









