E-PAPER

సిఎం రేవంత్‌కు విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు

హైదరాబాద్ సెప్టెంబర్ 14 వై 7 న్యూస్

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సిఎం రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్