E-PAPER

పృథ్వీరాజ్‌ పాడ్‌కాస్ట్‌లో ‘వారణాసి’పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.

2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రకటన నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా నిర్వహించిన ఓ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వారణాసి’తో పాటు దర్శకుడు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!