E-PAPER

Huawei MateBook Pro S లాంచ్.. ప్రపంచంలోనే అత్యంత తేలికైన ల్యాప్‌టాప్‌గా కంపెనీ ప్రకటన

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ హువావే కొత్త MateBook Pro S ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం 798 గ్రాముల బరువు, 11.9 మిల్లీమీటర్ల సన్నని డిజైన్‌తో వచ్చిన ఈ డివైస్‌ను ప్రపంచంలోనే అత్యంత తేలికైన పీసీగా కంపెనీ ప్రకటించింది. ఇందులో 14.2 అంగుళాల 3.1K డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కొత్త Kirin XE90 ప్రాసెసర్, Wi-Fi 7+ వంటి ఆధునిక ఫీచర్లను అందించింది.

ఈ కొత్త ల్యాప్‌టాప్‌తో పాటు హువావే తొలిసారిగా Privacy Screen Edition, Collectors Edition వేరియంట్లను కూడా పరిచయం చేసింది. విభిన్న అవసరాలున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎడిషన్లను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

కేవలం 798 గ్రాముల బరువు ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్ దృఢత్వాన్ని కాపాడేందుకు హువావే కొత్త Cloud Falcon Architectureను ఉపయోగించింది. దీంతో తక్కువ బరువు, సన్నని డిజైన్‌తో పాటు మన్నికను కూడా అందించేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా తరచూ ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఈ ల్యాప్‌టాప్ అనువైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!