E-PAPER

నీట్ ఆందోళనలపై బీహార్ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ ఊరట

నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై బీహార్‌లో జరిగిన విద్యార్థుల నిరసనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వందలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది.

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు భారీగా నిరసనలు చేపట్టగా, పోలీసులు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం శిక్షాత్మక చర్యలకు బదులుగా సానుకూల వైఖరి అవలంబించాలని నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం, 2026 జూలై 26 సాయంత్రం 6 గంటల వరకు జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతీకార లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోరు. అదే గడువులోపు నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకునేందుకు వెంటనే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News