E-PAPER

తెలంగాణ ఉద్యమ సేవలకు గుర్తింపు చిటికెల కృష్ణయ్యకు రాష్ట్రస్థాయి బాధ్యతలు

హైదరాబాద్ ;

హైదరాబాద్‌లోని రామంతాపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడు చిటికెల కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి రవి ఈ నియామకాన్ని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ పిలుపు మేరకు సాగరహారం, సకల జనుల సమ్మె, వంటా-వార్పు వంటి ఉద్యమ కార్యక్రమాల్లో రామంతాపూర్ వంశరాజ్ కులస్తులు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ పదవి ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా రామంతాపూర్ వంశరాజ్ సంక్షేమ సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే చిటికెల కృష్ణయ్య కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News