మణుగూరు;
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూరపాటి సౌజన్య పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కూరపాటి సౌజన్య ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, పూలతో సత్కరించారు. ప్రజలందరికీ ఉగాది పర్వదినం శుభాలు కలగాలని, రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకి నవీన్ , పట్టణ అధ్యక్షుడు శివ సైదులు మహిళా నాయకురాలు స్వరూపతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Post Views: 19








