మణుగూరు, మే 27(వై 7 న్యూస్);
ఓసి విస్తరణకు వ్యతిరేకం లేదని కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమని బి.అయోధ్య అన్నారు.రాజుపేట, విఠల్ రావు నగర్లో బ్లాస్టింగ్ దృష్ట్యా ప్రజలు ప్రమాదంలో ఉన్నారని తెలిపారు.ఇల్లులు పగిలిపోతున్నాయని, ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.సింగరేణికి లాభాలే ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం పట్టదా? అని ప్రశ్నించారు.కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
Post Views: 67









