E-PAPER

పొన్నగంటి కూర రోటి పచ్చడి వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..!..

మనం ఆహారంలో రోటి పచ్చళ్ళను భాగంగా చేసుకుంటే చాలా మంచిది. రోటి పచ్చళ్ళు మన నోటికి కొత్త రుచిని అందించటం మాత్రమే కాదు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటానికి కూడా దోహదం చేస్తాయి. అటువంటి రోటి పచ్చళ్ళలో పొన్నగంటి కూర రోటి పచ్చడి ఒకటి.

పొన్నగంటి కూరను ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందుగా చెబుతారు. పూర్వం నుంచి పెద్దలు కంటిచూపు మందగించకుండా ఉండటానికి, చర్మానికి కాంతి రావడానికి ఈ ఆకును తప్పనిసరిగా తినేవారు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో, ఎముకలను దృఢపరచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్థాలు:

శుభ్రం చేసిన పొన్నగంటి ఆకు- 200 గ్రాములు,
నూనె – 2-3 టీస్పూన్లు
మెంతులు – పావు టీస్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
తెల్ల నువ్వులు- 2-3 టేబుల్ స్పూన్లు
ఎండుమిరపకాయలు -4
పచ్చిమిరపకాయలు – 6
చిటికెడు పసుపు,
రుచికి సరిపడా ఉప్పు,
వెల్లుల్లి రెబ్బలు- 5
చిన్న నిమ్మకాయ సైజు చింతపండు,
తాలింపు గింజలు- ఒక టీ స్పూన్
చిటికెడు ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు- 1 కట్ చేసినది.

తయారీ విధానం:

ముందుగా పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తర్వాత తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేపాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి పొన్నగంటి ఆకును వేసి ఉప్పు, పసుపు కలిపి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.

చల్లారిన తర్వాత ముందు వేయించిన దినుసులు, మిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు కలిపి రోటి పచ్చడిలా బరకగా దంచుకోవాలి. చివరగా నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో కలిపి తింటే సూపర్ గా ఉంటుంది. రుచికి, ఆరోగ్యానికి బాగుంటుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!