E-PAPER

షుగరు పెరగకుండా ఉండాలంటే..! ఆహారంలో ఈ చిన్న మార్పులు చేయండి..

మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం తో బాధ పడుతున్న వారు ఎక్కవగా ఉంటున్నారు. మారుతున్న జీవన శైలి.. అలవాట్లు.. ఒత్తిడి ఇందు కు కారణాలుగా చెబుతున్నారు. అయితే, మందులతో పాటుగా కొన్ని చిన్న పాటి మార్పులు సైతం షుగరు బాధితుల్లో మార్పు తీసుకొస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. భోజనం తరువాత ఒక్క సారిగా షుగరు పెరిగే వారు తమ ఆహారంలో చిన్న మార్పులతో మధుమేహం నియంత్రణ చేసుకోవచ్చని సూచనలు అందిస్తున్నారు.

మధుమేహం ఉన్నవారికే కాకుండా, సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలోనూ భోజనం తర్వాత రక్తంలో చక్కెరలో వచ్చే మార్పులు రోజువారీ శక్తి స్థాయిలు, ఆకలిపై ప్రభావం చూపుతాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే లేదా త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరిగి, ఆ తర్వాత తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం, తీపి లేదా ఇతర ఆహారాలపై కోరిక కలగడం, అలసట లేదా నిద్రమత్తు వంటి అనుభూతులు కొందరిలో కనిపించే వీలు ఉంటుంది. భోజనం చేసే క్రమంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా రక్తంలో చక్కెర పెరుగుదలను కొంతవరకు నియంత్రించ‌వ‌చ్చని సూచిస్తున్నారు. ముందుగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అవసమరని చెబుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!