భారత్లో అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియో గోర్ బంగ్లాదేశ్లో మూడు రోజుల పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ముఖ్యంగా అమెరికా-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరుపక్షాలు చర్చించినట్లు సమాచారం.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న సెర్గియో గోర్.. బంగ్లాదేశ్తో వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఆయన చర్చలు జరిపారు.
బంగ్లాదేశ్ పర్యటన చివరి రోజైన శనివారం సెర్గియో గోర్ ఆ దేశ ప్రధాని తారిఖ్ రెహమాన్తో సమావేశమయ్యారు. ఢాకాలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమెరికా-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ పరిణామాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల మరింత బలోపేతానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.








