E-PAPER

చలో సంసద్ ర్యాలీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష విరమించిన అనంతరం, వేలాది మంది యువతతో కలిసి పార్లమెంట్ ముట్టడికి ‘చలో సంసద్’ ర్యాలీగా దూసుకువెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు.

పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ముందుకు సాగేందుకు ప్రయత్నించిన యువతను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ తోపులాటలో పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News