పలాస, జూన్ 24: పలాస మండలం లోత్తూరు గ్రామంలో కాశీబుగ్గ పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ వై. రామకృష్ణ, ఎస్సై ఎన్. సునీల్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సిల్లంగి వంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని, అనారోగ్య సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
Post Views: 5








