మెదక్ జిల్లా తూప్రాన్ అక్టోబర్ 29:-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో రెండోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళ్తే…..గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చిరుత పులి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. గత నెలాఖారున చిరుతపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.మళ్లీ రెండు రోజులుగా చిరుత పులి అటవీ ప్రాంతంలోని గుట్టపై కనిపిస్తున్నట్లు గ్రామస్థులు చెప్పారు.దీంతో అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 66









