E-PAPER

మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వాల అరికట్టాలి

. మహిళా చట్టాన్ని ప్రతిష్టంగా అమలుచేయాలి

భద్రాచలం, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్;

భద్రాచలం పి ఓ డబ్ల్యు ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కెచ్చేల కల్పన పాల్గొని మాట్లాడుతూ,మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు పాల్పడుతున్న వారిలో నూటికి 99 శాతం మంది మద్యం గంజాయి డ్రగ్స్ మత్తులోనే చేస్తున్నారనేది నేర పరిశోధక శాఖ చెబుతుంది అయినా పాలకులు, మద్యాన్ని ఒక ఆదాయ వనరు గాని చూస్తున్నారు దీనితో వంటల మహిళల శాతం పెరుగుతున్నది అంటే చనిపోవడం విడిపోవడం కుటుంబ కలహాలు ఇలాగ అనేకంగా జరుగుతున్నాయి సంవత్సరాల్లో ఇచ్చినమవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అశాంతితో నిత్యం ఘర్షణలతో ప్రేమ రహితంతో సంసారాలు పాడైపోతున్నవి. 1860 నుండి ఇప్పటివరకు ఎన్ని చట్టాలు చేసినా కాగితాలకే పరిమితం అయిపోతున్నాయి అని ఆమె అన్నారు. అదేవిధంగా గృహింస 498 చట్టం కూడా అమలు చేయడంలో వెనకబడి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా అధ్యక్షురాలు వై సావిత్రి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ప్రీ బస్సుల పేరుతో పాడైపోయిన బస్సులను నడుపుతున్నారని బస్సులు తగ్గించి డీలక్స్లు సూపర్ లగ్జరీలు పెంచారని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని. మారుమూల ప్రాంతాలకు కూడా బస్ సౌకర్యం కల్పించాలని అన్నారు. వైద్య సౌకర్యాల కల్పించాలని డెంగ్యూ చికెన్ గునియా తదితర వ్యాధుల్ని అరికట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో విద్య పాదపాదికన వైద్య బృందాలు పర్యటించాలని ఏరియా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. జనరల్ బాడీ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం నూతన డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.భద్రాచలం డివిజన్
కార్యదర్శి కొండ భవాని డివిజన్ అధ్యక్షరాలు మునిగేలా మహేశ్వరి ఉపాధ్యక్షులు. వెంకట నర్సమ్మ. సహాయ కార్యదర్శి. సిమిడి సుజాత . కోశాధికారి ఆర్ శారద. కమిటీ సభ్యులు. ఎస్.కె మైమదా పూజారి సామ్రాజ్యం కల్లూరి చంద్రమ్మ మరో ముగ్గురితో ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దాసరి సాయి. మునిగేల శివ ప్రశాంత్ కొండ కౌశిక్ ,కుమారి ,కోటేశ్వరమ్మ, చిన్న తల్లి. రేవతి. శాంతక్క. తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!